Unabated Gold Rush…తగ్గని గోల్డ్ రష్…

సిరా న్యూస్,ముంబై;
అమెరికాలో వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర బాగా పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,051 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 200 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 220 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 160 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 300 ఎగబాకింది.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 58,000 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,270 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,450 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 58,000 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,270 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,450 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,000 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *