ప్రభుత్వ ఖజానాకు గండి
మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తీరుపై విమర్శలు
సిరా న్యూస్,ఖమ్మం;
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
వాయిస్…ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో అక్రమంగా మట్టి మాఫియా కొనసాగుతుంది.చుట్టుపక్కల 15 గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూముల పేర నామమాత్రపు అనుమతులు తీసుకొని రాత్రి పగలు తేడా లేకుండా నల్ల మట్టికి బదులు మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నరు. ఇక కొందరు వ్యాపారులు చెరువు శిఖం భూమిని ఆక్రమించి ఫ్లాట్లుగా మారుస్తూ అమ్ముతున్నారు.
ఈ వైరా రిజర్వాయర్ నుండి రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఫ్లాట్లకు వేలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్న పట్టించుకునే నాధుడే కరువైపోయారు. పదుల సంఖ్యలో జెసిబిలు వందల సంఖ్యలో ట్రాక్టర్లు నిత్యం వైరా రిజర్వాయర్ నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.ఈ మట్టి మాఫియా వ్యక్తులు చెరువులో పెద్ద గోతులు తవ్వడంతో వానాకాలం చేపల వేట వెళ్లే జాలర్లకు ఎక్కడ లోతుందో తెలియక ప్రమాద బారిన పడే అవకాశం ఉంది
విజువల్ వాయిస్… ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మండల కేంద్రంలో వైరా రిజర్వాయర్ నుండి నల్ల మట్టిని మాత్రమే పంట పొలాలకు తరలించేందుకు కొందరు రైతులు నామమాత్రపు అనుమతులు పొందారు. పంట పొలాలకు అవసరమైన మేర మట్టిని తరలించి క్రమంలో ఇదే అదునుగా భావించిన కొందరు నల్ల మట్టికి బదులు గలస,మొరం మట్టి ని ఒక్కో ట్రిప్పుకు సుమారు 600 నుండి 1000 రూపాయల వరకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు.ఇలా యదేచ్చగా మట్టి దందా సాగిస్తున్నారు. వైరా రిజర్వాయర్ లో నల్ల మట్టిని వైరా,కొనిజర్ల,తల్లాడ. మండలాలకు చెందిన కొందరు దళారులు జెసిబి.కి 200రూపాయలు ట్రాక్టర్ కు 300 ట్రిప్పుకు డబ్బులు చెల్లిస్తూ అదే మట్టిని సుమారు 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మరికొందరు ఏకంగా ఒక అడుగు ముందుకేసి చెరువు శిఖం భూమిని సైతం ఆక్రమించి మట్టితో చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదనీ స్థానికులు వాపోతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక మామూళ్ల మత్తులో జోగుతున్నారో లేక మాకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో ఇచ్చిన అనుమతులు మొత్తం రద్దు చేస్తున్నట్లు రిజర్వాయర్ నుండి ఎవరు మట్టిని తరలించొద్దంటూ డి ఈ ప్రకటించినా ఆ అధికారి మాటలకు బేఖాతారు చేస్తూ వైరా రిజర్వాయర్ నుండి యదేచ్చుగా మట్టి దందా కొనసాగుతుంది.చర్యలు తీసుకోవలసిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వారికి ఎంత మేరకు మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం అంటున్నారు.మట్టి అక్రమ రవాణా పై ఉన్నతాధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు. ఇలాగే చెరువు నుంచి మట్టి తరలిస్తే చెరువులో నీళ్లు నిలువ ఉండకుండా రైతులు బోర్లు ఎండిపోయి పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి అనుమతి లేకుండా చెరువు మట్టి అక్రమ తరలింపుకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు