అంగన్వాడీ అందోళన

సిరా న్యూస్,విశాఖపట్నం;
కనీస వేతనాలు చెల్లించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతూ విశా ఖలో సిఐటియు కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యా లు కార్మికుల హక్కులను కలరాస్తే ప్రభుత్వానికి తమ గోడును వెల్లబో సుకునే పరిస్థితి నుంచి ప్రభుత్వమే ఉద్యోగుల హక్కులను కాల రాసే పరిస్థితులు దాపురించాయని సిఐటి యు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యక ర్తలకు ఇచ్చిన కనీస వేతనాల హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడం శోచనీ యమని వాపోయారు. ఎన్నికలకు ముందు వైకాపా ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని కోరుతున్నప్ప టికీ… వైకాపా ప్రభుత్వం కంచే చేను మేసే విధంగా హామీలను తుంగలో తొక్కుతూ ఒక నియంతలా ప్రవర్తిస్తోం దని ప్రజా సంఘాల నాయకులు దు య్యబట్టారు. అంగన్వాడీ కార్యకర్తల కు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తామని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి… తెలంగాణ అంగన్వా డీలతో సమానంగా జీతాలు ఇవ్వకుం డా వారి కంటే తక్కువ జీతాలు చెల్లిస్తు న్నారని గుర్తు చేశారు.ఎన్నికలకు ముం దు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిప క్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *