సిరా న్యూస్,రంగారెడ్డి;
శ్రీ రాముడు, శ్రీ రామ అక్షింతల పై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూకట్పల్లి వై జంక్షన్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేసారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులకు భజరంగ్ దళ్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాంతో స్వల్ప ఉద్రిక్త నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు.