సిరా న్యూస్,విజయవాడ;
అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. గత 40 రోజులు గా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పలుచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు చేప ట్టారు. తమ సమస్యలను పరిష్కరిం చాలని పెద్దఎత్తున నినాదాలతో హోరె త్తించారు. వేతనాలు పెంచే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.అంగన్వాడీల ఆందోళన ఉద్రి క్తతకు దారి తీసింది. చలో విజయవా డలో భాగంగా విజయవాడ తరలి వచ్చిన అంగన్ వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున విజయవాడ ధర్నా చౌక్లో నిద్రిస్తున్న మహిళల్ని బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమ వారం చలో విజయవాడ కార్యక్రమా నికి అంగన్వాడీలు పిలుపునివ్వ డం తో రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు విజయ వాడకు వెళ్తున్న మహిళలను అడ్డుకు న్నారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.