ఆటంకాలు లేని నిరంతర విద్యుత్ సరఫరా

జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ సుదర్శన్
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో గతేడాది 2022 ఏప్రిల్ నుంచి జనవరి 2023 వరకు 1164 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఎలాంటి అవాంతరాలు లేకుండా చేశామని జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ సుదర్శన్ తెలిపారు. ఈ సంవత్సరం కూడా 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకు 1363 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని, రానున్న నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరగ వచ్చని తెలిపారు. అలాగే డిమాండ్ కి సరిపడే విద్యుత్ ను నిరంతరం ఇవ్వడానికి ప్రభుత్వం, సంస్థ అన్ని విధాలా ముందస్తు చర్యలు తీసుకున్నదని తెలిపారు. రానున్న రోజులలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు వుండదని, 69 సబ్ స్టేషన్లను, 17వేల ట్రాన్సఫార్మర్లను మరమ్మతులు చేయడం జరిగిందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయబడుననీ ఆయన తెలిపారు. ఈ రోజు వరకు కొత్త 31.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ 132KV రామగుండం సబ్ స్టేషన్ లో పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతో పాటు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని ఎస్ ఈ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *