సిరా న్యూస్,మెదక్;
గోవులను రక్షించే ప్రయత్నం లో దుండగుల దాడిలో గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన గో రక్షా కార్యకర్త అరుణ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మియాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ ను పరామర్శించిన ఎంఎల్ఏ లు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడించారు. అరుణ్ కు మెరుగైన చికిత్స అందించవలసిందిగా ఆసుపత్రి యాజమాన్యానికి సూచించాల్సిందిగా ఎంఎల్ఏ పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ కు బండి సంజయ్ చెప్పారు.
======