యూత్ కాంగ్రెస్ అద్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడి

చెడు మాట్లాడకు చెడు వినకు చెడు చూడకు
 సిరా న్యూస్,హైదరాబాద్;
నీట్ అవకతవకలపై జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నిస్తు విన్నూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
దీనిలో భాగంగా ఏ విధంగా అయితే గాంధీ “మూడు కోతులు చెడు మాట్లాడొద్దు, చెడు చోడొద్దు, చెడు వినొద్దు ” అని చెప్పారో దానికి పూర్తి విరుద్దంగా నరేంద్ర మోడీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడడం లేదు, హోం మంత్రి అమిత్ షా కి ఏం కనబడడం లేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యార్థుల ఆర్తనాదాలు వినబడడం లేదని విమర్శించారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *