బాగ్ అంబర్ పేట లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

సిరా న్యూస్,హైదరాబాద్;
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ పర్యటన లో భాగంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ లో పర్యటించారు. ఈ పర్యటన లో కిషన్ రెడ్డి కి బస్తీల్లో అడుగడుగునా సాధారస్వాగతం లభించింది . మహిళలు, కాలనీ పెద్దలు పుర ప్రముఖులు కిషన్ రెడ్డి ని అక్కున చేర్చుకున్నారు. పలు కాలనీల్లో పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. మొదట నందనవనం కాలనీ లో ప్రారంభమైన బస్తీ యాత్ర కాలనీ పెద్దలను పుర ప్రముఖులను కలిశారు.
అనంతరం సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించారు. తర్వాత సంజయ్ గాంధీ నగర్ బస్తిలో పాదయాత్ర నిర్వహిస్తూ సాయిబాబా నగర్ చేరుకొని సాయిబాబా టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదానగర్ లో పర్యటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *