సిరా న్యూస్,మెదక్;
జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు శోకాన్ని మిగిల్చాయి. వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిచిపోయింది. పలు చోట్ల అర్థరాత్రి నుంచి వర్షం కురిసింది. పెద్దశంకరంపేటలో అత్యధికంగా 8.5 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. ధాన్యం ఆరబెట్టి వారం పది రోజులైనా ధాన్యం కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గొనె సంచుల కొరత ఉందని మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలేదు. వాహనాల కొరతతో తూకం వేసిన ధాన్యాన్ని కల్లాల వద్దే విడిచిపెట్టిన వైనం ఇది.