Upashetti Rajkumar: 40 దేశాల నాణేలు ప్రదర్శించిన‌ ఉపాశెట్టి రాజ్ కుమార్

సిరా న్యూస్,బోథ్‌
40 దేశాల నాణేలు ప్రదర్శించిన‌ ఉపాశెట్టి రాజ్ కుమార్

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సోమవారం 45 దేశాల పురాతన నాణేలను సోనాల గ్రామానికి చెందిన బాసెట్టి రాజ్ కుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా 1905 నుండి 1910 వరకు వినియోగంలో ఉన్న బ్రిటిష్ పాలన నాణేలతో పాటు మొగల్ పాలకులు అక్బర్ 1556 నుండి 1605 నాటి రాగి నాణేలను సహజన కాలంలో వినియోగించిన 1628 నుండి 1658 వరకు వినియోగించిన వెండి నాణేలను ప్రదర్శించారు. విద్యార్థులకు గత చరిత్ర గురించి తెలపాలన్న ఉద్దేశంతో వీటిని ప్రదర్శించడం జరుగుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *