సిరాన్యూస్, చిగురుమామిడి
వరి ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు
* కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి ఉప్పల శ్రీధర్
* వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
వరి ధాన్యం కొనుగోల్లలో అలసత్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఉప్పల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో టీ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు రికార్డింగ్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వరి ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. కొనుగోలు రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయవలసిందిగా సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో డిపిఎం సిహెచ్ ప్రవీణ్, ఏపీఎంలు మారపల్లి రాజేష్ , మట్టెల సంపత్, సీసీలు వెంకట మల్లు, సత్యనారాయణ, కమిటీ సభ్యులు వివో ఏలు రజిత, నిర్మల, చైతన్య, రైతులు హమాలీలు పాల్గొన్నారు.