సిరా న్యూస్, సూర్యాపేట:
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి…
రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎంపిటిసి పాకాల పరమేష్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం హుజూర్నగర్ నియోజకవర్గం కొండయగూడెం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంగ వీరస్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, నాయకులు నాగేంద్రబాబు, వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, అంజిరెడ్డి, దస్తగిరి, గోపిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు అంబటి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.