కాపుల ఆత్మీయ సమావేశంలో వైకాపా అభ్యర్దులు

 సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో కాపుల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కాపులకు పెద్ద పీట వేశారని ఎవరు ప్రవేశ పెట్టలేని కాపు నేస్తం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. రంగాని అతి దారుణంగా హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తికి కాపులు ఓటేస్తే రంగా ఆత్మ శోభిస్తుంది అని అన్నారు. రంగా గొప్ప వ్యక్తి అని పేదలకు పట్టెడ అన్నం పెట్టిన మహానీయుడు రంగా అని అన్నారు. కాపులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తెలిపారు. ఏడ్చి చంద్రబాబు నాయుడు దగ్గర బోడె ప్రసాద్ సీటు తెచ్చుకున్నాడని కొన్నిచోట్ల గొడవకు ప్రేరణ కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని అటువంటి చర్యలు మానుకోవాలి అని జోగి రమేష్ అన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *