గొడవలు సృష్టించే దురాలోచనలో వైకాపా

సిరా న్యూస్,పిఠాపురం;
పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఏదోరకంగా గొడవలు సృష్టించి,కౌంటింగ్ నిలుపుచేయాలనే దురాలోచనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తోందని,ఇందుకు కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీషీటర్లను,గూండాలను నియమిస్తోందంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణలు చేశారు.పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలోగల తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు.ఏ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లనైనా సరే క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఎన్నికల అధికారులకు,పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు..
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *