సిరా న్యూస్,ఉయ్యూరు;
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం జరిగింది. వీరమ్మ తల్లి గుడి నుంచి ప్రధాన సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు.
జోగి రమేష్ మాట్లాడుతూ కుట్రలతో కూటమి ఏర్పడింది. చంద్రబాబు పచ్చి మోసగాడు. ఎన్నికలు వస్తే ఎవరి కాళ్ళు అయిన బాబు పట్టుకుంటాడు. మోసపూరిత హామీలు ప్రజలు నమ్మద్దు. మైనార్టీలకు 4% శాతం రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. మంచి చేసిన జగన్ ను గెలిపించుకుందాం. జగనన్న ప్రభుత్వంలో బోడె ప్రసాద్ లబ్ధి పొందాడు. వైయస్సార్ పంట బీమా, రైతు భరోసా ద్వారా రూ.70,128 లబ్ధి చేకూరింది. ప్రచారానికి వెళ్తే నా భార్య, కూతురు, కొడుకులను బోడే తిట్టాడు. సంస్కారం లేని వ్యక్తి బోడె ప్రసాద్. బోడే ప్రసాద్ సతీమణి నాకు సోదరి లాంటిది. కాల్ మనీ ,సెక్స్ రాకెట్ లో బోడే పై కేసులో ఉన్నాయి. పెనమలూరు ప్రజలకు అండగా ఉంటానని అన్నారు.