Vaikapa’s victory is certain : వైకాపా విజయం ఖాయం

సిరా న్యూస్,తిరుమల;
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భావితరాల కోసం కొత్త ఆలోచనలతో బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తున్నారని… రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.. అభ్యర్థుల మార్పులు చేర్పుల వల్ల ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.
శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి మేరుగ నాగార్జున దర్శించి ముక్కులు తీరుస్తున్నారు.. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు… దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ టికెట్ల మార్పు వల్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నాడో, తమకు అర్థం కావడం లేదన్నారు . ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి కులంలోని పేదవాడి సంక్షేమానికి, రైతాంతానికి మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు.. 14 ఏళ్ల అవకాశమిచ్చిన ప్రజలకు, చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఎవరి పొత్తు అవసరం లేదని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *