సిరా న్యూస్, ఓదెల
పెద్దపెల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,581 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, ఠాగూర్ ,పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వంశీకృష్ణ గెలుపుతో విజయకేతనం చూపించారు. వంశీ కృష్ణ గెలుపుతో ఓదెల మండలంలోని కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.