సిరా న్యూస్,పిఠాపురం;
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లో యు. కొత్తపల్లి మండలం రాయుడుపోడు గ్రామంలో వైయస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో అందించే సంక్షేమ పథకాలు మళ్లీ పొందాలంటే జగన్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలుపరిష్కరిస్తామన్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నేను మీకు అందుబాటులో ఉంటానన్నారు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న నాయకులు జగన్ ప్రభుత్వం రావడానికి కృషి చేయాలన్నారు పేదవాడు కల నిజం కావాలంటే జగన్ ప్రభుత్వం రావాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు
================