సిరా న్యూస్, సైదాపూర్:
చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరి…
– పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి
అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు పోలియో చుక్కల గురించి అపోహాలు విడాలని సూచించారు. చిన్నారులు అంగవైకల్యం బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.