Varaprasad Rao: పరీక్ష కేంద్రం కొనసాగించాలి : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు

సిరా న్యూస్,బేల‌
పరీక్ష కేంద్రం కొనసాగించాలి : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్

ఆదిలాబాద్ జిల్లా బేలాలో గల కీర్తన డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో కొనసాగేలా చేయాలని స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్ కి శ‌నివారం ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు వినతి పత్రం ఇచ్చారు. ఈసంద‌ర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బేలా మండల కేంద్రం చుట్టు ఇప్పటికి రవాణా సౌకర్యం లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయ‌ని, అందులో సుమారు 400 మంది గిరిజన అమ్మాయిలు ఆదిలాబాద్ పోలేక డిగ్రీ విద్య కు దూరం అవుతున్నారని తెలిపారు. ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్న సెంటర్ ను యూనివర్సిటీ అధికారులు తొలగించడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న విషయాన్ని ప్రిన్సిపాల్ వారి దృష్టి కి తీసుకుని వెళ్లారు .మొత్తము యూనివర్సిటీ పరిధి లొనే ఇన్ని కిలోమీటర్ల దూరం లో ఏ సెంటర్ లేని విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంటనే శాసన సభ్యులు పాయల్ శంకర్ కాకతీయ యూనివర్సిటీ వి సి శ్రీ రమేష్ , అదనపు పరీక్షల నియంత్రణ అధికారి తిరుమల దేవి తో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *