సిరా న్యూస్,విశాఖపట్నం;
వసంత పంచమి సందర్భంగా బుధవారం విశాఖ శారదాపీఠానికి భక్తులు పోటెత్తారు. వందలాది మంది బాల బాలికలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యార్ధులు పెద్దఎత్తున సరస్వతీ పూజల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు. 987 మంది బాల బాలికలకు సామూహిక అక్షరాబభ్యాసాలు నిర్వహించగా, సరస్వతీ పూజల్లో 840 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. పరీక్షల సమయం కావడంతో అమ్మవారి పాదాల చెంత పూజలందుకున్న పుస్తకాలు, పెన్నులను విద్యార్ధులకు అందించారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులకు విశాఖ శారదాపీఠం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసింది