సిరాన్యూస్, బోథ్
సీఐ రమేశ్కు రాఖీ కట్టిన వేదం పాఠశాల విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామాల్లోకి తమ పుట్టింటికి వచ్చి నా మహిళలు సహోదరులకు రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకున్నారు. ఈసందర్బంగా మండల కేంద్రంలోని వేదం పాఠశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు రాఖీ కట్టడం తో పాటు సీఐ రమేష్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను అభినందించారు. వారి వెంట పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయులు పచ్చి పాల సంతోష్ ఉన్నారు.