Vedma Bojja Patel:సమస్యల పరిష్కారం కోసమే ఫోన్ ఇన్ కార్యక్రమం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్,ఉట్నూర్
సమస్యల పరిష్కారం కోసమే ఫోన్ ఇన్ కార్యక్రమం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన

ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుండే తెలుసుకొని, ఆ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు “ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్బంగా వివిధ మండలాల, గ్రామాలకు చెందిన గ్రామస్తులు, ఉద్యోగులు వందలాది మంది ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడి వారు ఎదురుకుంటున్న నీటి, రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, భూమీకి సంబందించిన, ఏజెన్సీలో మెగా డిఎస్సీ,పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యలను సిఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా చర్యలు చెపడతామని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్య పరిష్కారం కోసం ఫోన్ ఇన్, పొద్దు పొడుపు భోజ్జన్న అడుగు-మార్నింగ్ వాక్, పల్లె బాట లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాననీ అయన తెలిపారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *