Vedma Bojju Patel:విద్యార్థులు కష్టపడి చదవాలి

సిరా న్యూస్, ఇంద్ర‌వెల్లి
విద్యార్థులు కష్టపడి చదవాలి
* సంకల్పం గొప్పదైతే సాధించలేనిది లేదు
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
* ఘ‌నంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వార్షికోత్సవ
విద్యార్థులు కష్టపడి చదివి,అన్ని రంగాల్లో రాణించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని ఆదిశగా పయనించాలన్నారు. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన ఎల్లవేళలా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో ఆర్సిఓ గంగాధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *