Vedma Bojju Patel: సామూహిక వివాహాలతో ఆర్థికంగా మేలు

సిరాన్యూస్, ఇంద్రవెల్లి
సామూహిక వివాహాలతో ఆర్థికంగా మేలు
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించిన ఎమ్మెల్యే
సామూహిక వివాహాలతో పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని అంద్ గూడలో జరిగిన ఎనిమిది సామూహిక వివాహాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ ఫూలాజి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి, కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి రుణ భారాన్ని తగ్గించడానికి సామూహిక వివాహాలు జరపడం అనేది ఒక మంచి పరిష్కారంగా ఉంటుందని, సామూహిక వివాహాలు జరపడం గొప్ప సంప్రదాయామని అన్నారు. ప్రతి ఏడాది సామూహిక వివాహాలు జర్పిస్తు రావటం గొప్ప విషయం అన్నారు. ఎలక్షన్ కోడ్ అనంతరం ప్రభుత్వ పరంగా కళ్యాణ లక్ష్మి అందిస్తామన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *