సిరాన్యూస్, ఖానాపూర్
గాయత్రి బ్రాహ్మణ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన గాయత్రి బ్రాహ్మణ సంఘ భవనాన్నిశనివారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ , మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ , ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ ,పార్టీ మండల జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా ,పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.