సిరాన్యూస్, ఖానాపూర్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల్ కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్ కూతురికి శాస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ శనివారం మస్కాపూర్ గ్రామంలో ఉన్న వారి నివాస గృహానికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ,వైస్ చైర్మన్ కావలి సంతోష్, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పార్టీ మండల జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు జన్నారపు శంకర్ , తోట సత్యం , జహీర్ ఖాన్ , తదితరులు పాల్గొన్నారు.