సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
* ఎల్లమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గోదావరి నది తీరం వద్ద వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ బోనాల జాతర మహోత్సవంలో మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ , ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం , మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖానాపూర్ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.