సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సుగుణ గెలుపు కోసం కష్టపడి పని చేయాలి
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* జిల్లా బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశం
పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కై బూత్ స్థాయిలో కష్టపడి పని చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల బూత్ స్థాయి ఏజంట్ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కై బూత్ స్థాయిలో కష్టపడి పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దయనంద్, షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు యూసుఫ్ ఖాన్, కౌన్సిలర్ జన్నారపు శాంకర్, మైనార్టీ మండల అధ్యక్షులు సలీం ఖాన్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా, ముషీర్, మిర్జా బేగ్ నాయకులు కంటం రవి, రోహిదాస్, రాజు జియా, అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.