సిరాన్యూస్, ఉట్నూర్
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
* నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
* పాల్గొన్న ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు , కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు పేదవాడినైనా తనకు ఎమ్మెల్యే చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండి,పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.