Vedma Bojju Patel: ఉపాధి హామీ కూలీ రూ.400ల‌కు పెంచుతాం : ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, కడెం
ఉపాధి హామీ కూలీ రూ.400ల‌కు పెంచుతాం : ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్
రా* ష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి
* ఉపాధి హామీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థి…

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం కడెం మండలంలోని పాండ్వాపూర్ గ్రామం వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న వారి వద్దకు ఎంపీ అభ్యర్థి సుగుణతో కలసి వెళ్ళి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కోన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రోజువారి కూలీ 400 వరకు పెంచుతామన్నారు. రాహుల్ గాందీని ప్రధానిని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *