సిరాన్యూస్, ఉట్నూర్
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ రామనవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వారి కృపా కాటక్షలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.