సిరాన్యూస్, ఖానాపూర్
దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
* ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా బీజేపీ, బీఆర్ఎస్, ముదిరాజ్ సంఘం సభ్యులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దేశం అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసం పల్లె గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ, బిఆర్ఎస్, ముదిరాజ్ సంఘం సభ్యులు వందల సంఖ్యలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ పార్టీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విచ్చిన్నం చేస్తుందని, అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలహితం కోసం ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత తమదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన అంతిమ లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.