Vedma Bojju Patel: రాజ్యాంగం కాపాడబడాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, ఉట్నూర్ :
రాజ్యాంగం కాపాడబడాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* భారత రాజ్యాంగమే ఈ దేశానికి దిక్సూచి
* ఐదు న్యాయాల కరపత్రాల విడుదల

భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ఆ రాజ్యాంగం కాపాడబడాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీను అధికారంలో తేవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మండల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలో తేవాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో పదేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, కార్యకర్తలు గ్రామ గ్రామాన గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రచారం చేయాల‌న్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి అహర్నిశలు కృషి చేయాలన్నారు. రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మతోన్మాదుల నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కందాలపై ఉందని అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల కుటుంబం నుండి వచ్చిన నిజమైన దేశ భక్తుడు రాహుల్ గాంధీ అని ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించి, కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం స్థానిక నాయకులతో కలసి 5 న్యాయాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ బూత్ స్థాయి, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *