సిరా న్యూస్, కడెం
సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుగుణక్క ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కడెం హరిత రిసార్ట్ లో కడెం, దస్తురాబాద్ మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారు.బూత్ వారిగా సైనికుల్లాగా పని చేయాలని సూచించారు. మనస్పర్థలు పక్కన పెట్టి కుటుంబ సభ్యుల్లా కలిసి పని చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు కీలకమైనవని తెలిపారు. అనంతరం పార్టీ ఇంచార్జి సత్తు మల్లేష్ మాట్లాడుతూ నాయకులు సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాకి మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్ అధ్యక్షత వహించగా ప్రతి బూతులో లీడ్ వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు మండల నాయకులు, మహిళ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.