సిరా న్యూస్, ఉట్నూర్
అవ్వ గుబులు పడకు.. 4 వేల పెన్షన్ ఇస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బట్టలను ఇస్త్రీ చేసి హాస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే
అవ్వ గుబులు పడకు.. 4 వేల పెన్షన్ ఇస్తామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్ లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బట్టలను ఇస్త్రీ చేసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.అదే విధంగా ఓ అవ్వతో ముచ్చటీస్తు గుబులు పడకు త్వరలో 4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపిట వేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 3నెలల్లోనే గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ పథకం కింద 10లక్షల ప్రమాద భీమా,500 రూపాయాలకే గ్యాస్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వృద్ధులకు, అంగవైకల్యం చెందిన వారికీ, వితంతువులకు,4 వేల పెన్షన్ అందిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.