సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కాంగ్రెస్లో పలువురు చేరిక
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 5న కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ జెడ్పిటిసి, మాజీ ఉపసర్పంచ్ తో పాటు వందల మంది బిఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే విధంగా తర్లుపాడు,సత్తన్ పల్లి సేవ నాయక్ తండా,గ్రామాలకు చెందిన 400 వందలకు పైగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందల సంఖ్యలో బీజేపి,బిఆర్ఎస్ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతి పెద వాడికి అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ సభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు,కర్షకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.