సిరాన్యూస్, ఉట్నూర్
ఈనెల 14న గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* జయంతి ఉత్సవాల గోడపత్రుల విడుదల
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలో ఈనెల 14న దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దళిత సంఘాల నాయకులతో కలిసి జయంతి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రులను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి అహింసయుత మార్గాన్ని చూపిన బుద్ధుడు, అణగారిన తాడిత, పిడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు, బహుజన సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, పెద్ద ఎత్తున తరిలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.