Vedma Bojju Patel: ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, ఖానాపూర్‌
ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శ‌నివారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి, ఉట్నూర్, జన్నారం, దస్తురాబాద్, కడెం, ఖానాపూర్ మండల కేంద్రాలలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాలకు న్యాయం చేకురుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *