Vedma Bojju Patel: భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఉట్నూర్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఉమ్రిలో ఘ‌నంగా గౌతమ బుద్దుడు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలో జరిగిన గౌతమ బుద్దుడు, అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దళితుల, ఆదివాసి గిరిజనుల, సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే కుట్ర పన్నుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలిసి కట్టుగా ఉండి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందని అన్నారు. అంబేద్కర్ దయవల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని పేర్కొన్నారు. యువత బుద్ధుడు, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోని వారు చూపిన బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, కిన్వట్ సామాజిక కార్యకర్త కుడమేత వికాస్, దళిత సంఘాల నాయకులు భారత్ వాగ్మారే దళిత, బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *