సిరాన్యూస్, ఖానాపూర్
వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి :ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
* వరి ధాన్యాన్ని పరిశీలన
వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తన్ పల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడి హమాలీలను ఏర్పాటు చేసి ఆరిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ , జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు తోట సత్యం ,పుప్పాల శంకర్ , మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సలీం ఖాన్, వెంక గౌడ్,రాజేశ్వర్, లక్ష్మి పతి, జేంగిలి శంకర్,శ్రీను, సత్తాన్ పల్లి నాయకులు గూమ్ముల రమేష్, మలవత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.