సిరాన్యూస్,ఉట్నూర్ :
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* పెర్సపెన్ లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ మండలంలోని లక్షిటిపేట గ్రామంలో ‘భావె మహినా’ సందర్బంగా ఆర్క పరివార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పెర్సపెన్ లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఆదివాసీలు ప్రకృతిని దైవంగా భావించి ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసి తమ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. నేటి యువత సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారన్నారు. తమ ముత్తాతల కాలం నుంచి ఆచరిస్తున్న సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఎంతైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్క కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.