సిరాన్యూస్,దస్తురాబాద్ :
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* హనుమాన్ ఆలయంలో పూజలు
* పలువురికి పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం లోని మల్లాపూర్, బుట్టాపూర్, చెన్నూర్, రేవోజీపేట్ , గోడిసిర్యాల్ గొండ్ గూడ, గొడిసిర్యాల్, మున్యాల్ గోండుగూడ, మున్యాల తండా, ఎర్రగుంట, దస్తురాబాద్, బుత్కుర్, తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.బుట్టపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో రామ యజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. వివిధ గ్రామస్తులతో సమావేశమై గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న నీటి, రోడ్డు, కరెంటు, డ్రైనేజీ, డిఆర్డిపో భవన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల భీమా, 200 యూనిట్ల ఉచిత కరెంటు,500కె గ్యాస్ లాంటి పథకాలను ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు 2500 వేలు,4వేల పెన్షన్ అందిస్తామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు.వివిధ గ్రామాలలో పలువురిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.