Vedma Bojju Patel: సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తా:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఉట్నూర్
సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తా:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కాల‌నీల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమం
* పలువురికి పరామర్శ

కాలనీలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బోయవాడ, ఎన్టీఆర్ కాలనీ, హనుమాన్ నగర్, మేదరివాడ, మోబిన్ పురా కాలనీల్లో ఉదయం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్… పొద్దు పొడుపు-బొజ్జన్న అడుగు(మార్నింగ్ వాక్) కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులు ఎదురుకుంటున్న సమస్యలను స్టానికులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలలో ప్రధానంగా నీటి, డ్రైనేజీ, రోడ్డు, కరెంట్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ సమస్యలను గుర్తించడం జరిగిందని,ఈ సమస్యలన్నింటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటయిన కొన్ని నెలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీపథకం కింద 10 లక్షల భీమా, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు,500రూపాయాలకే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఇళ్ళు లేని నీరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 4వేల పెన్షన్, మహిళలకు 2500 రూపాయలను ఇస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో వస్తే 5న్యాయాలతో పాటు మరిన్ని పథకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకురుస్తామన్నారు. అనంతరం పలువురిని పరామర్శించి, ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *