సిరాన్యూస్, ఇంద్రవెల్లి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్ గావ్ గ్రామంలో గురువారం రాత్రి పిడుగు పడి భార్య భర్తలు అనక సంతోష్, స్వప్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దంపతులు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటుమని హామీ ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.