సిరాన్యూస్, కడెం
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కడెం మండల సర్వసభ్య సమావేశం
మండలంలోని గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలనీ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కారిస్తామన్నారు. కడెం ప్రాజెక్టుకు దాదాపుగా మరమ్మత్తు పనులు పూర్తి అయ్యాయన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని, త్వరలో రైతులు కష్టాలు తిరుతాయాని పేర్కొన్నారు. గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా కరెంటు శాఖ అధికారులు చూసుకోవాలన్నారు.సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి స్థానిక డాక్టర్లు ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహనా కల్పించాలన్నారు. పారెస్ట్ అధికారులు పోడు భూములను సాగు చేసుకుంటున్నా రైతులకు ఇబ్బంది పెట్టొద్దని అన్నారు.గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కాకముందే ప్రజలు అందులో ఉంటున్నారని, అది మంచి పద్ధతి కాదని, ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలనీ కోరారు. నిజమైన నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికీ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.