సిరాన్యూస్, ఉట్నూర్
రాష్ట్ర ఆయిల్ ఫామ్ అడ్వైజర్ కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఎమ్మెల్యేకు నియామక పత్రాన్ని అందజేసిన ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను ఖానాపూర్ ఉద్యావన పట్టు పరిశ్రమ శాఖ అధికారి మౌనిక మర్యాద పూర్వకంగా కలసి నియామక పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని అన్నారు.నెల నెల ఆదాయానీచ్చే ఏకైక పంట అని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రీయూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ మనోజ్ రెడ్డి, క్లస్టర్ ఆఫీసర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.