సిరాన్యూస్, ఉట్నూర్
ఉన్నత చదువులు చదువుకోవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో గల కొమరం భీమ్ స్టడీ సర్కిల్ ను సందర్శించారు.అక్కడ నాగోరావ్ కొడుకు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన వాటిని ఎదుర్కొంటూ లక్ష్య సాధన దిశగా పయనించాలని పేర్కొన్నారు. స్టడీ సర్కిల్ అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కంప్యూటర్, బుక్స్, సరైన వసతులు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.