Vedma Bojju Patel: బాధిత కుటుంబానికి రూ.10వేలు అందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
బాధిత కుటుంబానికి రూ.10వేలు అందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామానికి చెందిన చిలికిబాయి ఇండ్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా అగ్నికి అహుతి అయింది. ఆవిషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం చికిలిబాయితో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. విద్యుద్ఘాతానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.త్వరలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం ,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి బాధిత కుటుంబానికి 10వేల రూపాయాల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *